News March 2, 2025

మెదక్: మాజీ స్పీకర్ జయంతిలో పాల్గొన్న కలెక్టర్

image

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతిని మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యువజన, క్రీడల అధికారి వై.దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

Similar News

News March 3, 2025

మెదక్: ‘ప్రజావాణికి 24 దరఖాస్తులు’

image

ప్రజావాణి కార్యక్రమానికి 24 దరఖాస్తులు వచ్చాయని అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలపై దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. భూ సమస్యలు ఉన్నవారు తమ తమ మండల కేంద్రంలోని తహశీల్దారులకు సోమవారం అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు.

News March 3, 2025

కరాటే మాస్టర్ నగేష్‌కు హీరో సుమన్ అభినందనలు

image

వరల్డ్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ నగేష్‌కు సినీహీరో సుమన్ అభినందించారు. చెన్నైలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వహించారు. ఈ లార్జెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో 3 వేల మంది కరాటే మాస్టర్స్ మన దేశం నుంచి హాజరయ్యారు. తెలంగాణ నుంచి తెలంగాణ సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ ప్రాతినిధ్యం వహించగా 40 మంది నగేష్ వద్ద శిక్షణ పొందుతున్న కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు.

News March 3, 2025

సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని దివినో విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.

error: Content is protected !!