News March 2, 2025
మాజీ స్పీకర్ చిత్రపటానికి MHBD కలెక్టర్ నివాళి

దుదిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ హాజరయి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News December 26, 2025
NLG: LOVE AFFAIR.. భర్తను హత్య చేసిన టీచర్

ఓ ప్రభుత్వ టీచర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. CI నాగరాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్-పద్మ దంపతులు అచ్చంపేటలో నివాసముంటున్నారు. పద్మకు తోటి ఉపాధ్యాయుడు గోపితో ఏర్పడిన సంబంధం భర్త హత్యకు దారితీసింది. గత నెల 25న లక్ష్మణ్ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం స్పృహతప్పి పడిపోయినట్లు నాటకమాడగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు.
News December 26, 2025
వికారాబాద్: అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బదిలీ

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో రెవిన్యూ విభాగం అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ను రాష్ట ఎన్నికల కమిషన్ సెక్రటరీగా నియమించింది.
News December 26, 2025
తిరువూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

తిరువూరు బైపాస్లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు జల్ది కార్తీక్ (30) పట్టణంలోని ఒక మొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి దేవరపల్లి సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


