News March 2, 2025

ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

image

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.

Similar News

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

News November 6, 2025

మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

image

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.