News March 2, 2025

BREAKING: భారత్ గెలుపు.. సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరంటే?

image

CT: చివరి గ్రూప్ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. విలియమ్సన్ 81, శాంట్నర్ 28, యంగ్ 22, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12 రన్స్ చేశారు. వరుణ్ 5 వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ 2, అక్షర్, హార్దిక్, జడేజా తలో వికెట్ తీశారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్‌లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి.
స్కోర్లు: భారత్ 249/9, కివీస్ 205/10

Similar News

News March 3, 2025

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు..

image

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు మ.2.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. CT చరిత్రలో ఈ 2 పెద్ద జట్లు నాలుగు సార్లు తలపడగా రెండుసార్లు IND, ఒకసారి AUS గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఇరు జట్లూ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత్ ఆసీస్‌పై గెలిచి 2023 WC ఫైనల్‌లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని చూస్తోంది.
ALL THE BEST TEAM INDIA.

News March 3, 2025

ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన పంత్

image

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ‘లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 14 నెలల తర్వాత పునరాగమనం చేశారు. పంత్ తిరిగి కోలుకున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో నామినేట్ చేశారు. ఏప్రిల్ 21న విజేతలను ప్రకటించి అవార్డును అందజేయనున్నారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

News March 3, 2025

ట్రెండింగ్‌లో ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి <<15636348>>షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ <<>>దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. టీమ్ ఇండియాకు చేసిన సేవకు ఇదా మీరు ఇచ్చే గౌరవమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకూ పాకింది. ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే 10.5వేల ట్వీట్లు పడ్డాయి.

error: Content is protected !!