News March 2, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> అల్లూరి జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
> పాడేరు: ప్రవేశ పరీక్షకు 3,939 మంది విద్యార్థులు హాజరు
> పాపికొండల అందాలు చూసిన పర్యాటకులు
> ఓపెన్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO
> బడ్జెట్‌తో ఆదివాసీలకు అన్యాయం
> సీలేరు నదిపై ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి
> పోలవరం నిర్వాసితుల బ్రతుకులతో ఆటలు వద్దు: CPM

Similar News

News February 26, 2026

భూపాలపల్లి: రిజిస్ట్రేషన్లకు రేపే ఆఖరు!

image

జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. పీఎం కిసాన్ వంటి పథకాలకు కీలకమైన 11 అంకెల యూనిక్ ఐడీ కోసం ఫిబ్రవరి 28తో గడువు ముగియనుంది. జిల్లాలో లక్షా 21 వేల మంది రైతులు ఉండగా, ఇంకా 44,359 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆధార్ తరహాలో ఈ గుర్తింపు కార్డు తప్పనిసరని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం.

News February 26, 2026

ఇక రోజూ ‘డయల్ యువర్ టీచర్’: అనకాపల్లి డీఈవో

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం రోజూ నిర్వహించడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

News February 26, 2026

TU: ప్రారంభమైన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో పటిష్ఠమైన భద్రత, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.