News March 3, 2025
KPHBలో నేపాల్ వాసి ఆత్మహత్య..

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. KPHB 4వ ఫేజ్లోని LIG 213/2లో నివాసముండే ప్రేమ రావల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నేపాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం KPHBలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Similar News
News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.
News July 6, 2025
HYD: మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.
News July 6, 2025
HYD: త్వరలో ORR వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే..!

త్వరలో HYD అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని RTC బస్సులను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ HYD పరిధి ఉప్పల్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట సహా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణ సర్వీసులు అందజేస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తున్నారు.