News March 3, 2025
మార్చి 03: చరిత్రలో ఈ రోజు

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్షెట్జీ టాటా జననం
1847: టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం
1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం
1967: ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ జననం
1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం
2002: తొలి దళిత లోక్సభ స్పీకర్ బాలయోగి మరణం
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
Similar News
News March 3, 2025
కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు: గవాస్కర్

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.
News March 3, 2025
మనసు ‘దోశే’సిన వంటకం!

తెలుగువారికి బ్రేక్ఫాస్ట్లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.
News March 3, 2025
3 రాజధానులపై YCP యూటర్న్?

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.