News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్పోర్టులో దిగారు. మరి ఎయిర్పోర్ట్కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 3, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
✒ అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
✒ పొదలకూరు : రావి ఆకుపై నెలవంక. మసీదు చిత్రం
✒ మిస్ నెల్లూరు-2025గా విజేతగా HONEY PRIYA
✒నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?
✒ సోమశిల: నిషేధిత వలలతో జీవనోపాధి కోల్పోతున్న స్థానిక జాలర్లు
✒ నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి
✒ పశువుల కాపర్లపై చేజర్ల SI దాడి.?
News March 3, 2025
ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యలను గుర్తించాలి: కలెక్టర్

చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయొచ్చని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. చెవి సంరక్షణ, వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నేడు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
News March 3, 2025
KNR: మల్కా కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.