News March 3, 2025

నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరుఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువురులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Similar News

News November 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 10, 2025

మరిపెడ: తండా నుంచి హైకోర్టు న్యాయవాదిగా..

image

మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ నాయక్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మారుమూల తండా నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. లా విద్యను సంగారెడ్డిలోని టిటిడబ్ల్యూఆర్ కళాశాల నుంచి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.

News November 10, 2025

రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం

image

ఇవాళ ఉదయం రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు జిల్లా కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చనన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. అర్జీలు స్థానికంగా పరిష్కారం కాని ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిందిగా తెలిపారు.