News March 3, 2025
ADB: రైలు ఎక్కబోయి జారిపడి వ్యక్తికి గాయాలు

కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి జారి పడి గాయాలపాలైన ఘటన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కుందన్ పవార్ హైదరాబాద్కు వెళుతూ.. ఆదిలాబాద్ స్టేషన్లో వాటర్ బాటిల్ కోసం దిగాడు. అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ కదిలేటప్పుడు పరుగెత్తుతూ వెళ్లి ఎక్కేటప్పుడు జారి ప్లాట్ఫామ్పై పడిపోవడంతో అతని చెయ్యికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది చికిత్స అందించి రిమ్స్కు తరలించారు.
Similar News
News April 25, 2025
ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్నగర్కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
News April 25, 2025
నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 25, 2025
ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్లో ఒకరు, ఆదిలాబాద్లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.