News March 3, 2025
మోత్కూరు: సహజీవనం.. బాలిక సూసైడ్

మోత్కూరు మండలంలో ఆదివారం <<15633955>>బాలిక <<>> సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఆరెగూడెంకు చెందిన మున్నతో బాలికకు ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ గదిలో DEC నుంచి కలిసి ఉంటున్నారు. మున్న ఆదివారం HYD వెళ్లగా బాలిక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబీకులు, యువకుడు వచ్చాక ఆత్మహత్యకు గల కారణాలు చెప్తామని SI తెలిపారు.
Similar News
News September 16, 2025
డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
News September 16, 2025
MIM- జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిహార్ ఎన్నికలకు లింక్

బిహార్ ఎన్నికలకు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు అధికారికంగా లింకు లేకపోయినా MIM మాత్రం లింక్ పెడుతోంది. బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి హాఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అందులో MIM చేరితే ఇక్కడ ఆ పార్టీ పోటీలో ఉండకకపోవచ్చు. ఒకవేళ కూటమిలో చేరకపోతే MIM కచ్చితంగా పోటీచేస్తుంది. ఇదీ MIM అధినేత ఆలోచన అని సమాచారం. ఈ పొలిటికల్ ఈక్వేషన్ క్లారిటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.
News September 16, 2025
సంగారెడ్డి: ‘ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలి’

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రేపు జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాతీయ పతకాన్ని ఆవిష్కరించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.