News March 3, 2025
ఆదిలాబాద్: కౌంటింగ్ షురూ… అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జిల్లాలో ఇటీవల ప్రశాంతంగా ముగిసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించిన ఫలితాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోటీచేసిన అభ్యర్థులలో ఉత్కంఠ రేపుతోంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందో తేలిపోనుంది. మొత్తం14935 మందికి గాను 10,396 మంది ఓటు వేయగా 69.61 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే టీచర్స్ 1,593 మంది ఉండగా 1,478 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Similar News
News March 4, 2025
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ADB అదనపు కలెక్టర్

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలదేవ పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.
News March 4, 2025
ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP News

*నేరడిగొండలో పేద యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన ఆడపడుచులు
*పుట్టపర్తిలో ఆదిలాబాద్ జిల్లా భక్తుల పర్తి యాత్ర
*సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే ఆందోళన చేస్తాం: జోగు రామన్న
*ఉన్నతాధికారుల జోక్యంతో ప్రారంభమైన పత్తికొనుగోళ్లు
*జిల్లాలో 38 డిగ్రీల ఎండ
*పోలీసు క్రీడాకారులను సత్కరించిన ఎస్పీ
*టీచర్ MLC ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపు
News March 3, 2025
ADB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJP తరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతిచ్చింది.