News March 3, 2025
పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 404 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 404 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 8527 మంది విద్యార్థులకు గాను 8123 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 5613 మంది జనరల్ విద్యార్థులకు 5431 మంది విద్యార్థులు హాజరు కాగా, 2914మంది ఒకేషనల్ విద్యార్థులకు 2692 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News November 9, 2025
అనంత: ఆడ, మగ మృతదేహాల కలకలం

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువ(HLC)లో శనివారం సాయంత్రం 2 మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. బొమ్మనహాల్(M) నాగలాపురం HLC 116, 117 కిలోమీటర్ల వద్ద ఆడ, మగ మృతదేహాలను స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే బొమ్మనహాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి వయసు సుమారు 45 ఏళ్లు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
బాడీ షేమింగ్.. హీరోయిన్కు క్షమాపణలు

బాడీ షేమింగ్కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.


