News March 3, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 214 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులలో 9,256 మంది విద్యార్థులకు గానూ 9,080 మంది హాజరైనట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,141మంది విద్యార్థులకు గానూ 1,103 మంది హాజరయ్యారన్నారు. 214 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.
Similar News
News January 3, 2026
TU: ఈ నెల 16 నుంచి B.Ed, B.P.Ed 1,3 వ సెమిస్టర్ పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.Ed, B.P.Ed 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 29 వరకు జరగనుండగా 3 వ సెమిస్టర్ 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. అటు B.P.Ed 1, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 వరకు జరగనున్నాయి. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు.
News January 3, 2026
వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

అంతర్జాతీయ క్రికెట్కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 3, 2026
నార్నూర్ అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేయాలి: కలెక్టర్

నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్ను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్నూర్ సాధించిన ఈ విజయం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.


