News March 22, 2024

యాపిల్‌కు షాక్.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం

image

ఏకపక్ష విధానాలతో పోటీ సంస్థల మనుగడను ‘యాపిల్’ ప్రశ్నార్థకం చేస్తోందని, ధరలను కృత్రిమంగా పెంచుతోందని అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు) తగ్గిపోయింది. మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11 శాతం వరకు తగ్గడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.

Similar News

News September 10, 2025

ఆసియా కప్: నేడు IND vs UAE

image

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-A నుంచి భారత్, UAE తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో రా.8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2016 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో విజయావకాశాలు టీమ్ ఇండియాకే ఎక్కువగా ఉన్నప్పటికీ UAEని తక్కువ అంచనా వేయొద్దని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత 7 నెలలుగా భారత్ T20లు ఆడలేదని, అటు UAEకి ఇది హోమ్ గ్రౌండ్ అని గుర్తుచేస్తున్నారు.

News September 10, 2025

నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

image

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.

News September 10, 2025

నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే అంతే..

image

ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయనడానికి మరో నిదర్శనం నేపాల్. తీవ్ర అవినీతి, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు SMపై బ్యాన్ విధించడంతో నేపాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నుకున్న నేతలనే రోడ్లపై తన్నుకుంటూ తరిమికొట్టారు. PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితులే బంగ్లాలోనూ కనిపించాయి. ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి INDకు వచ్చేశారు.