News March 3, 2025
HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.
Similar News
News March 4, 2025
VKB: 40 శాతం వైకల్యం తప్పనిసరి: అసిస్టెంట్ ట్రైని కలెక్టర్

భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ALIMCO) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల మొదటిరోజు ఎంపిక శిబిరం స్థానిక ధర్మ విద్యాలయం స్కూల్లో నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ శిబిరానికి అసిస్టెంట్ ట్రైని కలెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఉమా హారతి హాజరయ్యారు. ఆమె మాట్లడుతూ.. ఉపకరణాలు పొందేందుకు కనీసం 40 శాతం వైకల్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
News March 4, 2025
సంగారెడ్డి: వారం రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు మంజీరా నదిలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన అనిల్ (21) మూడు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతికితే మంజీరా నదిలో శవమై కనిపించాడు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 4, 2025
సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.