News March 3, 2025
అమలాపురం: ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు

ఉన్నత విద్యకు 10వ తరగతి తొలిమెట్టు అని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అన్నారు. అమలాపురం డీఆర్ఓ ఛాంబర్లో సోమవారం 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి పరీక్షలకు జిల్లాలోని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 19,217 మంది విద్యార్థులు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. డీఈవో బాషా పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
News July 7, 2025
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ప్రభుత్వం ఆమోదం

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్గా క్వూ-చిప్-ఇన్ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందజేయాలని నిర్ణయించింది.
News July 7, 2025
కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్పై హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.