News March 3, 2025

3 రాజధానుల విధానంపై చర్చించి చెబుతాం: బొత్స

image

AP: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై YCP సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడు రాజధానులనేది ఆ రోజుకు మా విధానం. దానిపై ఇప్పుడు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతాం. అమరావతిని శాసన రాజధాని చేద్దామని అనుకున్నాం. అమరావతి శ్మశానంలా ఉందని నేను చెప్పింది వాస్తవమే. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భం మేరకు అలా మాట్లాడాను’ అని బొత్స తెలిపారు.

Similar News

News March 4, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్‌గా సన్నీ డియోల్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

image

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 4, 2025

నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!