News March 3, 2025

MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.

Similar News

News November 7, 2025

SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో.. గేట్లు మూసివేత

image

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద ప్రవాహం చాలావరకు తగ్గిపోయింది. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్ట్‌ నీటిమట్టం 332.54 మీటర్లు, నిల్వ 80.5 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 9,454 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సరస్వతి కాల్వకు 650, ఎస్కేప్‌ కెనాల్ ద్వారా 8,000, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు నష్టపోతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గేట్లను మూసేశారు.

News November 7, 2025

జిల్లాలో పెరుగుతున్న చలి పులి..!

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా మన్నెగూడెంలో 17.4℃, గోవిందారం 17.6, కథలాపూర్ 17.8, గోల్లపల్లి, రాఘవపేట 18.0, మల్లాపూర్ 18.1, పెగడపల్లె, నేరెళ్ల, జగ్గసాగర్ 18.3, తిరుమలాపూర్, మేడిపల్లె, సారంగాపూర్, పూడూర్, ఐలాపూర్ 18.4, జగిత్యాల 18.9, మెట్‌పల్లి 19.3, ఎండపల్లి, సిరికొండ, గుల్లకోటలో 19.9℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

News November 7, 2025

జగిత్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం

image

అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం వందేమాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం సామూహిక గేయ ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సైదులు, వేణు, పోలీస్ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు.