News March 3, 2025
కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్లో కలెక్టర్ తనిఖీ

కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేస్తామని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్ను సందర్శించామని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు.
Similar News
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
News September 16, 2025
కరీంనగర్: బతుకమ్మ చీరలు మాకు లేవా..?

బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే చీరలను మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే అందజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, గత BRS ప్రభుత్వం రేషన్ కార్డుల్లో పేరుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని మహిళా సంఘాల్లో సభ్యత్వం లేని మహిళలు అంటున్నారు. సభ్యత్వం ఉన్నవారికే బతుకమ్మ చీరలా? మాకు లేవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి KNRలో దాదాపు 45,350 మహిళా సంఘాలు ఉన్నాయి.
News September 16, 2025
హుకుంపేట: JCBని ఢీ కొట్టిన బైక్.. యువకుడి మృతి

పాడేరు మండలం చింతలవీధి సమీపంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. దాలిగుమ్మడి గ్రామానికి చెందిన థామస్ ప్రవీణ్ హుకుంపేట నుంచి పాడేరుకు బైక్పై వస్తూ JCBని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.