News March 3, 2025
కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News January 14, 2026
పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక!

జిల్లాలోని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ఇంకా గ్రామపంచాయతీలపై పట్టు సాధించలేదు. డిసెంబర్ 22న సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేయగా నిధులు, విధులకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కొత్త పాలకవర్గాలు పూర్తి స్థాయి ఆజమాయిషీ చేయలేకపోతున్నాయి. దీంతో ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గ్రామాల్లో వారి విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
News January 14, 2026
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు!

ప్రభుత్వ ధాన్యం మళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా సుమారు రూ.60 కోట్లకు పైగా విలువైన సీఎమ్ఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 8 బృందాలు నల్గొండ, సూర్యాపేటతో పాటు 10 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో తనిఖీ చేశారు.
News January 14, 2026
HZB: కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల కోసం హుజూరాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30గా ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.


