News March 3, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 100 ఫిర్యాదులు

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల ఆర్జీలను లా ఆఫీసర్ చంద్రావతి, డీఆర్ఓ హరిప్రియతో కలిసి మేడ్చల్ – మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 100 ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 17, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అటు TGలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు పడే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News September 17, 2025
టెక్కలి: జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.
News September 17, 2025
వ్యవసాయ కూలీ టీచర్ ఉద్యోగానికి ఎంపిక

వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మెగా డీఎస్సీలో రేపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ 15వ ర్యాంకు సాధించారు. రేపల్లెకు చెందిన సొంటి సురేష్ స్కూల్ అసిస్టెంట్ (సామాజిక శాస్త్రం) విభాగంలో 80.56 మార్కులతో 15వ ర్యాంకు సాధించి 2 పోస్టులకు ఎంపికయ్యారు. సురేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తనకు క్రమశిక్షణ నేర్పిందన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.