News March 3, 2025

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు నాయుడు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసుల నాయుడు 710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రోజు నుంచి ముగ్గురు మధ్య పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రతి రౌండ్లో శ్రీనివాసులు నాయుడు కొంతమేరకు ఆదిక్యం కనపరుస్తూనే వచ్చారు. చివరకు ఎలిమినేషన్ రౌండ్-2 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు గెలుపొందినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.

Similar News

News March 4, 2025

ధ్రువపత్రంతో గాదె శ్రీనివాసులునాయుడు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఆయనకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పదో రౌండ్లో పాకలపాటి రఘువర్మకు లభించిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడికి 12,035 ఓట్లు వచ్చాయి.

News March 4, 2025

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా అభ్యంతరాల స్వీకరణ

image

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.

News March 3, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు
➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు
➤ రుషికొండ బ్లూ ఫ్లాగ్ ఇష్యూ పై జేసీ సమీక్ష
➤ వాట్సాప్‌లో పదో తరగతి హాల్ టికెట్లు
➤ ఈ నెల 6న ఒకే వేదికపై దగ్గుపాటి పురంధేశ్వరి, చంద్రబాబు
➤ ఈ నెల 4వ తేదీ నుంచి అసంఘటిత కార్మికులు ధర్నా
➤ ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు

error: Content is protected !!