News March 3, 2025
నిర్మల్: 8, 9వ తరగతి విద్యార్థులకు పోటీలు

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8, 9 తరగతుల బాలికలకు బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News October 29, 2025
సర్వదర్శనానికి 8 గంటల పైనే

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 64,065 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోగా.. 25,250 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.57 కోట్లు ఆదాయం వచ్చింది.
News October 29, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 29, 2025
తిరుపతి: ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు

తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇవాళ నుంచి యథావిధిగా పనిచేయాలని DEO కేవీఎన్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడారు. DYEOలు, MEOలు, HMలు కలెక్టర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి, అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. పాఠశాలలు ఇవాళ నుంచే సాధారణంగా పనిచేసేటట్లు చూడాలని అన్నారు.


