News March 3, 2025
ఆత్మహత్య చేసుకుంటా.. సుప్రీం కోర్టుకు లాయర్ బెదిరింపు

తాను వాదిస్తున్న కేసులో పిటిషన్ను విచారణకు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ న్యాయవాది ఏకంగా సుప్రీం కోర్టునే బెదిరించారు. వీడియో కాన్ఫరెన్స్లో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ నెల 7లోపు తమకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో బార్ లైసెన్స్ రద్దు చేసి అరెస్టు చేయిస్తామని తేల్చిచెప్పింది.
Similar News
News March 4, 2025
ట్రంప్ టారిఫ్ నిబంధనలు.. స్టాక్ మార్కెట్లలో కలకలం

మెక్సికో, కెనడాపై తాము విధించిన సుంకాల్లో ఎటువంటి మార్పూ ఉండదని, నేటి నుంచి అమల్లోకి వస్తాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదుపులకు లోనయ్యాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇక భారత్లో నిఫ్టీ ఒకశాతం తక్కువగా మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఎలా ఉండనుందన్న కోణంలో మదుపర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.
News March 4, 2025
నేడూ పెన్షన్ల పంపిణీ

AP: పెన్షన్దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి ఇవాళ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.
News March 4, 2025
వేలం తొలి రౌండ్లో అన్సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.