News March 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR: యాసంగికి సాగు నీరివ్వాలి: సీఎస్
* ఎల్లారెడ్డిలో పోలీసుల కవాతు
* రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్
* ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: బీసీ విద్యార్థి సంఘం
* ప్రజావాణికి 52 ఫిర్యాదులు: KMR కలెక్టర్
* జాతీయ విలు విద్య పోటీలకు బిక్కనూరు విద్యార్థి
* హామీలు అమలు చేసే వరకు పోరాటం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
* ఇందిరమ్మ ఇళ్ల నమూనా పరిశీలన
* పింఛన్ కోసం పడిగాపులు
Similar News
News September 17, 2025
చంద్రగిరి కోటలో కూలిన కోనేరు ప్రహరీ

భారీ వర్షానికి చంద్రగిరి కోటలోని పురాతన కోనేరు ప్రహరీ కూలింది. గతంలో ఈ కోనేరులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ నిర్వహిస్తుండేవారు. తర్వాత బోటింగ్ నిలిపివేశారు. ఆర్కియాలజీ అధికారి బాలకృష్ణారెడ్డి కోనేరు గోడను పరిశీలించారు. అధికారులకు దీనిపై నివేదిక పంపనున్నట్లు తెలిపారు. వర్షం ఎక్కువగా పడటంతోనే కోనేరు గోడ కూలిందని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
News September 17, 2025
రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.