News March 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR: యాసంగికి సాగు నీరివ్వాలి: సీఎస్
* ఎల్లారెడ్డిలో పోలీసుల కవాతు
* రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్
* ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: బీసీ విద్యార్థి సంఘం
* ప్రజావాణికి 52 ఫిర్యాదులు: KMR కలెక్టర్
* జాతీయ విలు విద్య పోటీలకు బిక్కనూరు విద్యార్థి
* హామీలు అమలు చేసే వరకు పోరాటం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
* ఇందిరమ్మ ఇళ్ల నమూనా పరిశీలన
* పింఛన్ కోసం పడిగాపులు
Similar News
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.
News November 6, 2025
VKB: సీఎం వెళ్లే రహదారే ఇలా ఉంటే.. ఎలా?

మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కాగా, VKB జిల్లాలోని రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు తరుచూ HYD – బీజాపూర్ రహదారిలో వెళ్తారని సీఎం వెళ్లే రహదారికే ఈ దుస్థితి ఉంటే.. స్థానిక ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
News November 6, 2025
చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.


