News March 4, 2025

భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు కొత్త పిచ్

image

CT ఫస్ట్ సెమీఫైనల్‌లో రేపు భారత్, ఆసీస్ తలపడనున్నాయి. హైబ్రిడ్ విధానం వల్ల భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతోంది. ఇది టీమ్ఇండియాకు కలిసొస్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌కు కొత్త పిచ్ వినియోగిస్తున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. AUSకు చెందిన క్యూరేటర్ మాథ్యూ శాండ్రీ ఆధ్వర్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) పిచ్ సిద్ధం చేసింది.

Similar News

News January 20, 2026

వెంకీ ‘AK-47’లో నారా రోహిత్?

image

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’(AK-47)లో హీరో నారా రోహిత్ నటిస్తారని తెలుస్తోంది. విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ రోల్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ కొనసాగుతుండగా రోహిత్ పాల్గొన్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా విడుదల తేదీ మారుస్తారని టాక్.

News January 20, 2026

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News January 20, 2026

స్టార్ హోటళ్లు, రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ

image

AP: స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ మారుతోంది. నగరంలో ₹1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ITC ₹328 కోట్లతో హోటల్ నిర్మిస్తుండగా, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi సంస్థ 7-స్టార్ లగ్జరీ రిసార్ట్, హోటల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది. వీటితో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వేలాది మందికి ఉపాధి దక్కనుంది.