News March 4, 2025
ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

రఘునాథపాలెం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 4, 2025
రఘునాథపాలెం: యువకుడి ఆత్మహత్య.. వ్యక్తి అరెస్టు

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
News March 4, 2025
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డికి సర్టిఫికెట్ అందజేత

ఖమ్మం – వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్టిఫికెట్ను అందజేశారు. హోరా హోరీ సాగిన స్థానంలో యుటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News March 4, 2025
కొత్తగూడెం ఎయిర్పోర్టు.. వాతావరణ రిపోర్ట్ కీలకం

కొత్తగూడెం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో 900 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గత జనవరి 23న AAI ఫీజిబులిటీ సర్వే నిర్వహించింది. మరిన్ని వివరాలు కావాలంటూ కేంద్ర వాతావరణ శాఖను కోరింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత ఎయిర్పోర్టుకు ఎంపిక చేసిన ప్రదేశంలో గాలుల తీరుతెన్నులు, వర్షాలు తదితర అంశాలను బేరీజు వేస్తారు. సానుకూల ఫలితాలు వస్తే తదుపరి కార్యాచరణ మొదలయ్యే అవకాశముంది.