News March 4, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాలు ద్వారా రూ.8,17,320, VIP దర్శనాలు రూ.1,80,000, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.1,13,600, కళ్యాణ కట్ట రూ.90,000, సువర్ణ పుష్పార్చన రూ.75,200, యాదరుషి నిలయం రూ.44,860, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,77,910 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News March 4, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ మరో సంచలనం

image

టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

News March 4, 2025

చందంపేట: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చందంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం.. మానవత్ తండాకు చెందిన రమావత్ పాండు, ఆయన ఇద్దరు భార్యలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిల్డింగ్ తండా సమీపంలో ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాండు మృతి చెందగా.. భార్యలు కౌసల్య, చాందిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!