News March 4, 2025
MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News March 2, 2026
SRCL: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.
News March 2, 2026
కామారెడ్డి: ప్రజాస్వామ్య విలువలకు నిలువుటద్దం దుద్దిల్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


