News March 4, 2025

MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.

Similar News

News November 7, 2025

వందేమాతరం ఉత్సవం ఘనంగా నిర్వహించాలి: మన్యం డీఈవో

image

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్&జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ‘వందే మాతరం’ జాతీయ గీతం 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్ఠిగా వందేమాతరం గీతం ఆలపించాలని మన్యం డీఈవో రాజ్ కుమార్ తెలిపారు.

News November 7, 2025

గన్నవరంలో యాక్టీవ్ అవుతున్న వల్లభనేని వంశీ

image

గన్నవవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారు. నకిలీ పట్టాల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో వంశీ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల వై.ఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

News November 7, 2025

దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

image

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.