News March 4, 2025
వికసిత్ భారత్ యువ పార్లమెంట్ నోడల్ జిల్లాగా సిద్దిపేట

వికసిత్ భారత్ యువ పార్లమెంట్ నోడల్ జిల్లా గా సిద్దిపేట ఎంపిక అయ్యిందని సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీతా తెలిపారు. భారత యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో దేశ యువత ఆలోచన విధానాలను పాలసీలో పొందుపరిచి ప్రపంచంలోనే భారత దేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడానికి యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. యువత ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News January 13, 2026
సంగారెడ్డి: ‘నవజాత శిశు మరణాలు తగ్గించాలి’

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు మరణాలు తగ్గించేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 1,000 మంది శిశువుల్లో 18 మంది మరణిస్తున్నారని, ఆ సంఖ్య పదికి తగ్గించాలని సూచించారు. సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
News January 13, 2026
తిరుపతి: పండగ పూట పస్తులేనా..?

తిరుపతి జిల్లాలో 23 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న 150 మంది సిబ్బందికి 12వ తేదీ అయినా జీతాలు అందలేదు. జీతాలు లేకుండా పండగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో జీతాలు చెల్లించాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
News January 13, 2026
రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


