News March 4, 2025
భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News July 6, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.
News July 6, 2025
ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయండి: కలెక్టర్

ఈనెల 10వ తేదీ కొత్తచెరువులో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్ చేతన్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలిసి కొత్తచెరువులో మాట్లాడుతూ.. మెగా PTM 2.0 కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉందన్నారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.
News July 6, 2025
ప్రైవేట్ పాఠశాలల్లోనూ నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జులై 10న పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్-పీటీఎం 2.0 సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన సమావేశాలు ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పలు పోటీలు జరుగుతాయన్నారు.