News March 4, 2025

గద్వాల: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: హృదయరాజ్ 

image

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 8,341 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

image

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్‌లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.

News November 14, 2025

PDPL: సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

పెద్దపల్లి జిల్లా సబ్ రిజిష్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిష్టర్ కార్యాలయాల్లో అవినీతి నిర్ములించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిష్టర్ కార్యాలయంలో పలు రికార్డులను, డాక్యుమెంట్లు, ఇతర పాత్రలను పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను సైతం విచారిస్తున్నారు.

News November 14, 2025

పోలీసులు అలెర్ట్‌గా ఉండాలి: ఎస్పీ

image

ఢిల్లీ పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండే సున్నితమైన ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.