News March 4, 2025

రాజమండ్రి: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

Similar News

News October 16, 2025

క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

image

రాజమహేంద్రవరం జీజీహెచ్‌‌లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.

News October 16, 2025

18న రాజమండ్రిలో జాబ్ మేళా

image

తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న రాజమండ్రిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ప్రాంగణంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మేళాలో పలు ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు.

News October 15, 2025

RJY: నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

image

నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాకు ఆయన సమ్మె నోటీసు అందజేశారు. కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.