News March 4, 2025

అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే: ఎమ్మెల్సీ గాదె

image

AP: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన వ్యక్తే గెలిచారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన <<15643983>>వ్యాఖ్యలపై<<>> గాదె శ్రీనివాసులు నాయుడు స్పందించారు. ‘అవునా.. అచ్చెన్న నాకు మద్దతిచ్చారా? నాకు దానిపై అవగాహన లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే నేను గెలిచా’ అని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన రఘువర్మ ఓడిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News March 4, 2025

పాకిస్థానీ అని పిలవడం నేరం కాదు: సుప్రీం కోర్టు

image

మియాన్-తియాన్, పాకిస్థానీ అని పిలవడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ తర్జుమా ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగి ఉద్యోగిని పాకిస్థానీ అంటూ దరఖాస్తుదారుడు దూషించాడు. అతడిపై చర్యలకు ఝార్ఖండ్ కోర్టు ఆదేశించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది.

News March 4, 2025

BREAKING: మహిళలకు అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతలో 150 డ్వాక్రా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దెను ఆర్టీసీ చెల్లించనుంది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున HYD పరేడ్ గ్రౌండ్‌లో 50 బస్సులను సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. త్వరలోనే మరో 450 సంఘాలకు బస్సులను అందించనున్నారు.

News March 4, 2025

ఏపీకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా?

image

AP విభజన జరిగి పదేళ్లయినా పూర్తిస్థాయి <<15642015>>రాజధాని <<>>లేదు. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించగా, 2019లో గెలిచిన YCP 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. 2024లో వచ్చిన కూటమి GOVT అమరావతే రాజధాని అని చెప్పింది. దీంతో రేపు మరో పార్టీ గెలిస్తే రాజధానిని మళ్లీ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా అన్ని పార్టీలు కలిసి APకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా? అనేది నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!