News March 4, 2025
కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
Similar News
News January 7, 2026
టీటీడీ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం

టీటీడీ పరిధిలోని రెండు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది. టీటీడీ విద్యా కమిటీ సూచన మేరకు బోర్డు తీసుకున్న నిర్ణయంను బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో తరహా టీటీడీ జూనియర్ కళాశాలలో విద్యార్ధులందరికి మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
News January 7, 2026
నిర్మల్ బల్దియా పోరు.. అభివృద్ధిపైనే పార్టీల గురి

నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ నిర్మల్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. పట్టణాభివృద్ధే ప్రధాన అజెండాగా పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపైనే అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
News January 7, 2026
వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గోపాల్ నాయక్

వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సభావత్ గోపాల్ నాయక్ నియమితులయ్యారు. బుధవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశారు.


