News March 4, 2025
కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
Similar News
News January 14, 2026
తాడిపత్రిలో పందుల పోటీలు

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని తాకుతున్న వేళ అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఎక్కడైనా కోడి పందేలు, రాతిదూలం లాగుడు పోటీలు, బల ప్రదర్శన పోటీలు చూశాం. కానీ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న రీతిలో పందుల పోటీలను జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. తాడిపత్రి వాసులు మాత్రం ఈ పోటీలను జేసీ 10 ఏళ్ల కిందటే నిర్వహించారని హర్షం చేశారు.
News January 14, 2026
BREAKING: భారత్ ఓటమి

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరగనుంది.
News January 14, 2026
కొమురవెల్లి మల్లన్న దర్శించుకున్న సీపీ

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సీపీ రష్మి పెరుమాల్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈనెల 18న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, క్యూలైన్, సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


