News March 4, 2025
భర్త ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన పరసా రాధిక తన భర్త ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. పెళ్లై 10 సంవత్సరాలైందని, భర్త ధర్మరాజు తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే ఉద్యోగం సాధించగలిగానని రాధిక తెలిపారు. భర్త గంధం ధర్మరాజు బీటెక్ చదివి సొంత ఊర్లోనే వ్యవసాయం, తేనెటీగల పరిశ్రమ నడుపుతున్నారు. రాధిక దంపతుల కుమారుడు నోయల్ మూడవ తరగతి చదువుతున్నాడు.
Similar News
News March 4, 2026
హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
News March 4, 2026
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్గా ఖమేనీ కుమారుడు!

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
News March 4, 2026
నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్రేట్ కలిసొచ్చి సెమీస్కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్ రికార్డ్లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.


