News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News January 20, 2026
సిరిసిల్ల: జిల్లా విద్యాశాఖ అధికారిగా జగన్మోహన్ రెడ్డి

సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారిగా జగన్మోహన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో లెక్చరర్గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి జిల్లా విద్యాశాఖ అధికారిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News January 20, 2026
JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

TG: LRSలో పెండింగ్లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.
News January 20, 2026
NZB: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7 రోజుల జైలు

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష పడినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి వర్ని చౌరస్తా వద్ద తనిఖీల్లో బీహార్కు చెందిన హీరాలాల్ యాదవ్ పట్టుబడగా, కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఆర్మూర్కు చెందిన నందుకు రూ. 10 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.


