News March 4, 2025
MBNR: రైతు వేదికలపై.. సర్కార్ ఫోకస్

రైతు వేదికలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారులు ప్రత్యేక నివేదికను స్థానిక ఏఈఓలచే స్వీకరించి ఏర్పాటు చేశారు. MBNR-88, NGKL-142, GDWL-94, WNPT-71, NRPT-77 రైతు వేదికలు ఉండగా.. ఒక్క రైతు వేదిక నిర్మించడానికి రూ.22 లక్షలు ఖర్చయింది. పలు రైతు వేదికలు ధ్వంసం అవ్వగా, మరికొన్ని మౌలిక వసతులు లేవు. నిధులు మంజూరు అయితే మరమ్మతులు చేయించనున్నారు.
Similar News
News March 4, 2025
INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
News March 4, 2025
అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్వర్క్లో చేరి ఆన్లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.
News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.