News March 22, 2024

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఒక ముఖ్యమైన మెసేజ్‌ను టాప్‌లో పిన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై గరిష్ఠంగా 3 మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలు కల్పించింది. పర్సనల్ చాట్‌లతోపాటు గ్రూప్స్‌, పోల్స్, ఫొటోలు, ఎమోజీలను కూడా పిన్ చేసుకోవచ్చు. ఇవి డిఫాల్ట్‌గా ఏడు రోజులు టాప్‌లో ఉంటాయి. కావాలనుకుంటే ఒక రోజు, 30 రోజులకు సెట్ చేసుకోవచ్చు.

Similar News

News October 2, 2024

రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా!

image

ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లతా రజినీకాంత్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ‘శస్త్రచికిత్స జరిగిందని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని పేర్కొన్నారు.

News October 2, 2024

పెన్షన్లు తీసుకునేవారికి గమనిక

image

AP: ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

News October 2, 2024

స్వాతంత్ర్యం తర్వాత గాంధీ నిరాహార దీక్ష.. ఎందుకంటే?

image

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎన్నో దీక్షలు చేపట్టారు. అయితే, స్వాతంత్ర్యం అనంతరం కూడా రెండు డిమాండ్లతో 1948 జనవరి 13న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. పాకిస్థాన్‌కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వాలని, ఢిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలని దీక్షలో కూర్చున్నారు. మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఆయన ఇలా చేశారని చెబుతుంటారు. విభజన సమయంలో పాక్‌కు భారత్ రూ.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.