News March 4, 2025
టీమ్ ఇండియా ఫైనల్ చేరేనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగే సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచులో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
Similar News
News March 4, 2025
BREAKING: మహిళలకు అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ

TG: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతలో 150 డ్వాక్రా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దెను ఆర్టీసీ చెల్లించనుంది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున HYD పరేడ్ గ్రౌండ్లో 50 బస్సులను సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. త్వరలోనే మరో 450 సంఘాలకు బస్సులను అందించనున్నారు.
News March 4, 2025
ఏపీకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా?

AP విభజన జరిగి పదేళ్లయినా పూర్తిస్థాయి <<15642015>>రాజధాని <<>>లేదు. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించగా, 2019లో గెలిచిన YCP 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. 2024లో వచ్చిన కూటమి GOVT అమరావతే రాజధాని అని చెప్పింది. దీంతో రేపు మరో పార్టీ గెలిస్తే రాజధానిని మళ్లీ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా అన్ని పార్టీలు కలిసి APకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా? అనేది నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 4, 2025
IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.