News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News September 16, 2025
ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 16, 2025
సిరిసిల్ల: బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గీస బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ఎగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, సహాయ కార్యదర్శులుగా నరేందర్, రాజెల్లయ్య, భూమయ్య, వెంకటి, కోశాధికారిగా ప్రభాకర్ ను ఎన్నుకున్నామన్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News September 16, 2025
సిరిసిల్ల: ‘హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు’

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించినట్టు సిరిసిల్ల SP మహేష్ బి గితే తెలిపారు. SP తెలిపిన వివరాలు.. వేములవాడలోని ఓ మామిడి తోటలో మరిపెళ్లి రాజయ్య(64), మంత్రి ఆనందం పనిచేస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్యలో గొడవలు రాగా ఆనందం ఏప్రిల్ 29, 2024లో రాజయ్యను పారతో తలపై బాది హత్య చేశాడు. నేరం రుజువు కాగా శిక్ష పడిందన్నారు.