News March 4, 2025

నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేశారు. విజయనగరానికి చెందిన గాదె 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు.

Similar News

News January 11, 2026

HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

image

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.

News January 11, 2026

HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

image

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.

News January 11, 2026

తిరుపతికి ఫ్లైట్ ఎక్కాలంటే రూ.13వేలు

image

హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్‌లో వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా ఈ రూట్‌లో ఒక్కో టికెట్ రూ.3700 నుంచి రూ.4500 వరకు ఉంటుంది. ఈనెల 13వ తేదీ మాత్రం రేట్లు భారీగా పెరిగాయి. రూ.9వేల నుంచి రూ.14వేల వరకు పలుకుతోంది. తిరుపతి నుంచి హైదాబాద్ వెళ్లే ఫ్లైట్స్ మాత్రం రూ.8వేల లోపే ఉండటం గమనార్హం.