News March 4, 2025
నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేశారు. విజయనగరానికి చెందిన గాదె 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ టీచర్గా పని చేశారు.
Similar News
News January 15, 2026
చిత్తూరు: మీ ఫ్రెండ్స్ను కలిశారా..?

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.
News January 15, 2026
NZB: మత్తు కలిపి మాయ చేశారు

మత్తులో దించి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ చేసి రిమాండ్కు తరలించారు. వినాయక్నగర్కు చెందిన శ్రీనివాస్కు ముగ్గురు ఓ టీ స్టాల్ వద్ద పరిచమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఓ హోటల్లో శ్రీనివాస్ను కలిశారు. బియ్యం వ్యాపారం గురించి మాటల్లోకి దించి <<18857042>>మత్తు<<>> మందు కలిపిన బీరు తాగించారు. బాధితుడు మత్తులోకి జారుకోగానే ఒంటిపై ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
News January 15, 2026
మన విజయనగరంలో రంజీ మ్యాచ్.. ఎప్పుడంటే?

విజయనగరం ఏసీఏ స్టేడియంలో జనవరి 22న రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. విధర్భ- ఆంధ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి మ్యాచ్లు ఇక్కడ జరుగుతుండటంతో విజయనగరానికి ఇది మంచి క్రీడా గుర్తింపు లభించనుంది. స్థానిక యువ క్రికెటర్లకు ఇది ప్రేరణగా నిలిచే అవకాశం ఉంటుందని క్రీడాకారులు అంటున్నారు.


