News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News February 24, 2026
రైల్ పార్సిల్ యాప్తో హోమ్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి

డోర్ టు డోర్ పార్సిల్ బుకింగ్, డెలివరీ సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) దేశంలోనే తొలి ‘రైల్ పార్సిల్ యాప్’ను తీసుకొస్తోంది. రేపు HYD డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనుంది. రైల్వే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లి పార్సిళ్లను తీసుకొని డెలివరీ చేస్తారు. సేవల నిర్వహణ, లాజిస్టిక్స్ మార్కెట్పై స్టడీ చేసేందుకు IIM బెంగళూరుతో రైల్వే శాఖ ఒప్పందం చేసుకోనుంది.
News February 24, 2026
‘వాల్తేరు రైల్వేకు అదనపు ఆదాయం’

వాల్తేరు డివిజన్ తన టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచేందుకు 10 WAP-7 ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లపై ప్రకటనల కోసం ఢిల్లీ సంస్థతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఏడాదికి రూ.7 లక్షలకు పైగా, మొత్తం మీద రూ. 26 లక్షల ఆదాయం లభిస్తుందని డీఆర్ఎం పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంజిన్లపై జొమాటో వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తున్నాయి.
News February 24, 2026
హనుమకొండ: రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ పెంచండి: CP

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమం ద్వారా పోలీస్ అధికారులు వారివారి స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిగే నష్టాలపై ప్రజలకు అవెర్నెస్ కల్పించాలని వరంగల్ CP అధికారులను అదేశించారు. అలాగే కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించాలన్నారు.


