News March 4, 2025
జైపూర్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ కేజీబీవీలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.
Similar News
News October 22, 2025
వైట్హౌస్లోకి బుల్డోజర్లు.. కారణమిదే!

వరుస వివాదాలు చుట్టుముడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైట్హౌస్లోని ఈస్ట్ వింగ్లో కొంతభాగాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిస్తున్నారు. తన బాల్రూమ్ ప్రాజెక్టు ($250M) కోసం ఆయన ఇలా చేస్తున్నారు. కూల్చివేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక విందులు, సమావేశాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించే పెద్ద గదినే బాల్రూమ్/బాల్హాల్ అంటారు.
News October 22, 2025
కరేడులో 672 ఎకరాల భూసేకరణ పూర్తి: కలెక్టర్

ఉలవపాడు(M) కరేడులో తాజాగా 80 ఎకరాల భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలిపారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం కరేడులో 4,800 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 672 ఎకరాలకు పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో కరేడు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 22, 2025
BREAKING: HYD: అమీర్పేట్ సదర్ ఉత్సవాల్లో అపశృతి

HYD అమీర్పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.