News March 4, 2025

కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News July 5, 2025

ఏల్చూరులో పెట్రోల్ దొంగలతో జనం బెంబేలు

image

సంతమాగులూరు(M) ఏల్చూరులో పెట్రోల్ దొంగలతో జనం హడలెత్తిపోతున్నారు. రాత్రి వేళల్లో ఇంటి బయట పార్క్ చేసిన బైకుల్లో పెట్రోల్‌ను దొంగిలిస్తుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సినిమా హాలు వీధిలో నాలుగు బైకుల్లో పెట్రోల్‌ చోరీ చేశారన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ ప్రాంతాల్లో పెట్రోల్ దొంగలు ఉన్నారా..! కామెంట్ చేయండి.

News July 5, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్‌పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.

News July 5, 2025

ఆత్మకూరు ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం

image

నంద్యాల (D) ఆత్మకూరులో జరిగిన ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఘటనకు కారణాలను వివరించాలని పేర్కొంది. కాగా ఎమ్మెల్యే బుడ్డా లేకుండా ఎంపీ శబరి నియోజకవర్గ పర్యటనకు సిద్ధమవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలోని ఓ వర్గం ఆమె వాహనాన్ని అడ్డుకుంది. టీడీపీ నేత ప్రతాప్ రెడ్డిపై రాళ్లు విసిరింది.