News March 4, 2025
MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News August 16, 2025
తూ.గో: విలీన మండలాలకూ ఫ్రీ బస్సులు వర్తిస్తాయి: డీపీటీఓ

పోలవరం విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం, ఎటపాక, చింతూరు ప్రాంతాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తూ.గో. జిల్లా ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (డీపీటీఓ) వై.ఎస్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల మహిళల అభ్యంతరాలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు.
News August 16, 2025
తూ. గో: ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సులు

రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
News August 16, 2025
రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికి ప్రథమ స్థానం

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.