News March 4, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News March 16, 2026
షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్లైన్లో సన్ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్లైన్లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్ఫ్లవర్కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.
News March 16, 2026
‘చిన్న కాళేశ్వరం’కు ఈసారైనా మోక్షం లభించేనా?

నేటి నుంచి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి 2026-27 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మన మంథని నియోజకవర్గ ప్రజల చూపు రాష్ట్ర బడ్జెట్పై పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న (ముక్తేశ్వర) ఎత్తిపోతలకు ఈ బడ్జెట్లోనైనా నిధుల మోక్షం లభిస్తుందా? లేదా గత బడ్జెట్ల మాదిరిగానే మొండిచేయి చూపుతారా? అనే ఆందోళన నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది.
News March 16, 2026
సిద్దిపేట: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు:కలెక్టర్

సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికల భద్రత విషయంలో రాజీ పడొద్దని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.


