News March 4, 2025
దుబాయ్లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 5, 2026
బాలకృష్ణ సినిమాలో విలన్గా మంచు మనోజ్?

గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటించే ఛాన్సుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల ‘మిరాయ్’లో మనోజ్ విలన్గా నటించి మెప్పించారు. కాగా గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
News March 5, 2026
అనకాపల్లి: ‘జనగణన నిర్వహణకు సన్నద్ధం కావాలి’

జిల్లాలో జనగణనకు అధికారులు సన్నద్ధం కావాలని డీఆర్వో సత్యనారాయణరావు ఆదేశించారు. దీనిని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనకాపల్లి డైట్ కళాశాలలో జనగణన అధికారులకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు. 2011 తరువాత 2027లో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు.
News March 5, 2026
బెంబేలెత్తున్న కర్నూలు జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో కర్నూలు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో వేర్వేరుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం కర్నూలు జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


