News March 4, 2025
పార్వతీపురం: అందుబాటులో పదో తరగతి హాల్ టికెట్లు

పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫోటో, సంతకం, సబ్జెక్టు వివరాలను నిశితంగా పరిశీలించల్లన్నారు. హాల్ టికెట్ల్లో ఏవైనా తప్పులు ఉంటే గుర్తించి తక్షణమే పరీక్షల విభాగాన్ని సంచాలకులకు సమాచారం అందించాలన్నారు. www.bse.ap.in వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
Similar News
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.
News March 22, 2026
వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News March 22, 2026
గద్వాల: రోడ్డు ప్రమాదం.. మృతులు కర్ణాటక వాసులు

బలిగేర శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత పనులు ముగించుకుని బైక్పై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. మృతులు దేవునిపల్లికి చెందిన తిమ్మప్ప (35), ఓగులప్ప (40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


